జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ కసరత్తు షురూ..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ కసరత్తు షురూ..

Summarize with AI

సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణంతో తెలంగాణ  (Telanganaలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి (Jubilee Hills Constituency) ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ కీలక స్థానంలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది.

టికెట్ రేసులో ప్రముఖులు
ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. అంతర్గత సర్వేల ఆధారంగా ముగ్గురు అభ్యర్థుల జాబితాను రూపొందించి, తుది ఆమోదం కోసం ఏఐసీసీకి పంపనున్నారు.

ఈ టికెట్ రేసులో:

టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

గతంలో ఎంఐఎం తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్

డాక్టర్ సి. రోహిన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వంటి ప్రముఖులు ఉన్నారు.

ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణిని అభ్యర్థిగా ప్రకటించి, సానుభూతి ఓట్లను కూడగట్టాలని చూస్తోంది. ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయం.

Join WhatsApp

Join Now

Leave a Comment