మరో మూడు రోజులు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు

తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరికలు

Summarize with AI

వాయుగుండం (Cyclone) తీరం దాటిన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో, మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.

తెలంగాణలో పరిస్థితి
తెలంగాణ (Telangana)లో మరో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, మరో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment