ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం

ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం

Summarize with AI

ఉపరాష్ట్రపతి (Vice President) ప‌ద‌వికి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) ఆరోగ్య కారణాలతో రాజీనామా (Resignation) చేయడంతో, ఎన్నికల సంఘం (ఈసీ)(EC) కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను వేగవంతం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 63 నుంచి 71, వైస్-ప్రెసిడెంట్ (ఎలక్షన్) రూల్స్, 1974 ప్రకారం ఈ ఎన్నికను 60 రోజులలోపు, అనగా సెప్టెంబర్ 19లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఈసీ ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేయడం, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం కోసం చర్యలు చేపట్టింది.

లోక్‌సభ (Lok Sabha)లో 543, రాజ్యసభ (Rajya Sabha’s)లో 245 మంది, నామినేటెడ్ సభ్యులతో సహా ప్రస్తుత ఎలక్టోరల్ కాలేజీలో 788 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎన్నిక సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ వోట్ (ఎస్‌టీవీ) ద్వారా అనుపాత ప్రాతినిధ్య విధానంలో రహస్య బ్యాలెట్‌తో జరుగుతుంది.

జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ సమర్పించారు. త‌న ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్టికల్ 67(a) ప్రకారం తక్షణమే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ రాజీనామా మంగళవారం ఆమోదించబడింది. ధన్‌ఖడ్ ఆగస్టు 2022 నుంచి ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు రాజ్యసభ విధులను నిర్వహిస్తారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం కలిగి ఉండటంతో, హరివంశ్ సింగ్, మనోజ్ సిన్హా, వీకే సక్సేనా వంటి పేర్లు అభ్యర్థుల రేసులో చర్చలో ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment