కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం కుబేర, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించగా, రష్మిక మందన్న హీరోయిన్గా మెరిసింది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య ఈ నెల 20న విడుదలైన కుబేర, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ధనుష్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. నాగార్జున కూడా తన వయసుకు తగ్గ మంచి పాత్రను ఎంచుకుని మెప్పించారని కితాబు వచ్చింది.
ప్రశంసలతో పాటు, కుబేర కలెక్షన్స్ విషయంలోనూ అదరగొడుతోంది. విడుదలైన మొదటి రోజు మార్నింగ్ షోస్ కాస్త నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, మ్యాట్నీ నుండి జోరు పెంచుకుని హౌస్ఫుల్స్తో నడిచింది. మొత్తంగా, మొదటి రోజు రూ. 27.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి డీసెంట్ స్టార్ట్ అందుకుంది. అద్భుతమైన మౌత్ టాక్తో రెండవ రోజు అంచనాలను మించి అటు ఇటుగా రూ. 23.5 కోట్ల గ్రాస్ రాబట్టింది.