త‌ల్లిని పోగొట్టుకొని త‌ల్లిడిల్లిన చిన్నారులు.. కంట‌త‌డి పెట్టిన వాహ‌న‌దారులు

త‌ల్లిని పోగొట్టుకొని త‌ల్లిడిల్లిన చిన్నారులు.. కంట‌త‌డి పెట్టిన వాహ‌న‌దారులు

మేక (Goat)ను కొనుగోలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ (Woman) మృత్యుఒడికి చేరింది. బస్సు(Bus)ను ఆటో(Auto) ఢీకొన్న ఘటనలో ఆమె దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్‌ (Mahabubabad) మున్సిపాలిటీ (Municipality) పరిధిలోని బేతోలు శివారు భజన తండా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లాలోని బయ్యారం (Bayyaram) మండలం జగత్‌రావుపేట (Jagathraopet) జీపీ పరిధిలోని బోటి తండా (Boti Tanda)కు చెందిన మాలోత్ సురేశ్ (Maloth Suresh), అతడి అన్న గణేశ్ (Ganesh), వదిన అమలాదేవి (Amaladevi) (27), వారి ఇద్దరు కుమారులు నాలుగేళ్ల గౌతమ్, ఏడాదిన్నర వయసుగల గగన్, అక్కాబావ బానోత్ రంగ్య, మంజుల ఓ ఆటోలో కురవి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా దాటుతుండగా, ముందునుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్‌ బ్రేక్ వేయడంతో ఆటో వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో అమలాదేవికి తీవ్ర గాయాలు కాగా, మిగతా వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి.

మృత్యువాత పడిన అమలాదేవి
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 108 వాహనం క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (Government General Hospital)కి తరలించారు. అమలాదేవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కాగా, మంగళవారం తమ ఇంటి వద్ద ఎల్లమ్మ పండుగ చేసుకోనున్న నేపథ్యంలో కురవిలోని అంగడిలో మేకను కొనుగోలు చేయడానికి వారంతా ఆటోలో వెళ్తున్నట్లు బంధువులు పేర్కొన్నారు.

తల్లి కోసం చిన్నారుల ఆర్తనాదాలు
ఈ విషాద ఘటనలో తల్లిని కోల్పోయిన కుమారులు గౌతమ్, గగన్.. తల్లి అమలాదేవి కనిపించకపోవడంతో వెక్కివెక్కి ఏడుస్తుండగా వారిని ఆపడం ఎవరితరం కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కురవి ఎస్సై(SI) గండ్రాతి సతీశ్ (Gandrathi Satish), సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారుల రోదన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment