అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ఎయిర్ ఇండియా (Air India) విమానం (AI171) ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Praja Shanti Party) కేఏ పాల్ (KA Paul) కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విమానయాన (Union Aviation Minister) మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu)ను పదవి నుంచి తొలగించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 265 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటనలో పరిపాలనా నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యాలే కారణమని ఆయన ఆరోపించారు. ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడిన పాల్.. రామ్మోహన్నాయుడుకు విమానయాన రంగంలో అనుభవం లేదని, ఆయన కొనసాగడం దేశ ప్రతిష్టకు అవమానమని తీవ్రంగా విమర్శించారు.
ప్రమాదం వెనుక అదానీ గ్రూప్ నిర్మాణ కార్యకలాపాలు ఒక కారణమని కేఏ పాల్ ఆరోపించారు. “అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అదానీ నిర్మిస్తున్న భవనాలు ప్రమాదానికి దారితీశాయి. దీనిపై సమగ్ర విచారణ జరపాలి” అని డిమాండ్ చేశారు. అలాగే, ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఉండవచ్చని సందేహం వ్యక్తం చేస్తూ, నిస్పక్షపాత విచారణ కొనసాగాలని కోరారు. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి చేసిన రాజీనామా డిమాండ్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన పాల్, గతంలో రైలు ప్రమాదం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన ఉదాహరణను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో పాల్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.