పండుగ (Festival) సందర్బంగా రాష్ట్రం మొత్తం ఆనందంలో మునిగిపోతున్న సమయంలో అనకాపల్లి (Anakapalli) లో విషాద ఘటన చోటుచేసుకుంది. పరవాడ ఫార్మాసిటీ (Parawada Pharma City) లోని రాంకీ CET (కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్) ప్లాంట్లో శనివారం అర్ధరాత్రి సమయంలో స్యాంపిళ్లు సేకరిస్తున్న సమయంలో విషవాయువు లీక్ (Toxic Gas Leak) అయింది. ఈ ప్రమాదంలో ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician) అప్పలనాయుడు (Appalanaidu) అక్కడికక్కడే మృతి (Died) చెందారు.
ప్రాథమిక సమాచారం మేరకు, డేంజరెస్ గ్యాస్ను పీల్చడం (Inhalation) వల్లే ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు, సంబంధిత పరిశ్రమాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే గ్యాస్ లీక్కు గల ఖచ్చిత కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో ఫార్మాసిటీలోని భద్రతా ప్రమాణాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పండగ పూట ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టిన ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.