ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రజలను మోసం (People Cheated) చేసిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిలువునా వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ (Vennupotu Dinam) నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఘనంగా చేపట్టాలని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ( FormerChief Minister) వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు
వైసీపీ నాయకులు తమ నిరసనలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu)పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ (Super Six) సహా 143 హామీలను ప్రకటించి, వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా, జగన్ హయాంలో పేదలు ఇంటివద్ద ఆత్మగౌరవంతో రేషన్ సరుకులు అందుకునేవారని, కానీ చంద్రబాబు ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను (Ration Distribution System) డీలర్ల చేతికి అప్పగించి అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. దీనితో పేదలు రోజంతా రోడ్లపై నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడిందని వైసీపీ నాయకులు తెలిపారు.
‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం
వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీల్లో పార్టీ శ్రేణులు పాల్గొని, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ర్యాలీల అనంతరం, స్థానిక అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. వేమూరు నియోజకవర్గంలో రేషన్ వ్యాన్లతో వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు, ఇది ప్రజల దృష్టిని ఆకర్షించింది.
వైసీపీ నాయకుల విమర్శలు
కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సర కాలంలోనే రూ.1,51,604 కోట్ల అప్పు చేసిందని, అప్పుగా తెచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చారు అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఆ డబ్బుతో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. “చంద్రబాబు బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పి ఇంటింటా బాండ్లు పంపిణీ చేశారు, కానీ ప్రజలను మోసం చేశారు” అని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక, వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంకలా మారిందని చేసిన తప్పుడు ప్రచారాన్ని కూడా వైసీపీ నాయకులు ఖండించారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం తొలగించి, రైతులకు ఇన్సూరెన్స్, క్రాప్ సౌకర్యాలు లేకుండా చేసిందని, దళారీ వ్యవస్థను ప్రోత్సహించిందని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం ద్వారా వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశాయి. ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.