తన తాత (Grandfather) వైఎస్ రాజారెడ్డి (YS Raja Reddy) శత జయంతి (Centenary Celebrations) ని వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) జరుపుకున్న తీరు వైసీపీ శ్రేణులు విపరీతంగా ఆకట్టుకుంటోంది. జగన్ సింప్లిసిటి (Jagan Simplicity)కి ఇది నిదర్శనమని కొనియాడుతున్నారు. వైఎస్ రాజారెడ్డి 100వ పుట్టిన రోజును వైఎస్ జగన్ విజయవాడ (Vijayawada)లోని నిర్మలా శిశు భవన్ (Nirmala Sishu Bhavan)లో జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
వైఎస్ జగన్ దంపతులు విజయవాడలోని నిర్మల శిశు భవన్ (Nirmala Sishu Bhavan)కు గురువారం సందర్శనకు వెళ్లారు. అక్కడ ఉన్న దివ్యాంగ చిన్నారులతో (Disabled Children) మాట్లాడి, వారి కోసం కొంత సమయం కేటాయించారు. పిల్లలతో సంతోషంగా ముచ్చటించిన ఈ దంపతులు, వారితో సరదాగా గడిపారు. అక్కడే రాజారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రాజారెడ్డికి చిన్నారులతో విషెస్ చెప్పిస్తూ కేక్ కట్ చేపించారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
వైఎస్ జగన్ చిన్నారులతో గడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైఎస్ జగన్ విజయవాడకు వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో వైసీపీ (YSRCP) కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Cherishing and honouring the 100th anniversary of my late grandfather's memory. pic.twitter.com/CS6IyD08pi
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025
పులివెందులలో..
వైఎస్ రాజారెడ్డి స్వస్థలమైన పులివెందుల (Pulivendula)లో కూడా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడి సీఎస్ఐ చర్చిలో వైఎస్ విజయమ్మ (YS Vijayamma), వైఎస్ షర్మిల సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన తాత రాజారెడ్డిని గుర్తు ఏపీసీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.