పోసాని అరెస్టుపై స్పందించిన వైఎస్ జ‌గ‌న్‌

పోసాని అరెస్టుపై స్పందించిన వైఎస్ జ‌గ‌న్

సినీ నటుడు, ర‌చ‌యిత‌, ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్టుపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పందించారు. పోసాని స‌తీమ‌ణి కుసుమ‌ల‌త‌తో ఫోన్‌లో మాట్లాడారు. అంద‌రం తోడుగా ఉన్నాం.. భ‌య‌ప‌డొద్దు అని, పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, వైసీపీ లీగ‌ల్ టీమ్ ఇప్ప‌టికే అనంత‌పురం చేరుకుంటుంద‌ని, అన్ని ర‌కాలుగా తోడుగా ఉంటుంద‌ని వైఎస్ జ‌గ‌న్ మాట్లాడారు. కూట‌మి ప్ర‌భుత్వ నిరంకుశ పాల‌న ఎక్కువ రోజులు సాగ‌ద‌న్నారు. బ్లాస్ట్ అయ్యేరోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని, ప్ర‌జ‌లు, దేవుడు అంతా చూస్తున్నార‌ని వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

బుధవారం రాత్రి గ‌చ్చిబౌలిలోని ఆయ‌న నివాసంలో ఏపీ పోలీసులు పోసాని కృష్ణ‌ముర‌ళిని అరెస్టు చేశారు. జ‌న‌సేన నేత మ‌ణి ఫిర్యాదు మేర‌కు ఓబులవారిపల్లి పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. కాసేప‌టి క్రిత‌మే ఓబుల‌వారిప‌ల్లి పీఎస్‌కు పోసాని పోలీసులు తీసుకువచ్చారు. పీఎస్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోసాని అరెస్టును ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది.

ముందురోజు తేదీ ఎలా వేస్తారు..? – వైసీపీ
పోసాని అరెస్టు విషయంలో పోలీసుల డబుల్ గేమ్ ఆడుతున్నార‌ని, 26వ తేదీ అరెస్టు చేసి నోటీసులో 27వ తేదీ వేశారని వైసీపీ ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టింది. పోసాని కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్ గా పేర్కొన్నారని, కాని ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నంబర్ లో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ అని చెప్పారని, న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుండి కేసును డ్రైవ్ చేస్తున్నటుగా వైసీపీ అనుమానాలు వ్య‌క్తం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment