పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఇంటికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు వెళ్లనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని కల్లితండాలోని మురళీ నాయక్ నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని మాజీ సీఎం పరామర్శించనున్నారు. బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శిస్తారు.
వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాలను పరామర్శించిన అనంతరం 12.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 తిరిగి బెంగళూరుకు చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 5.45 గంటలకు బెంగుళూరు నుంచి తాడేపల్లికి బయలుదేరనున్నారు. కల్లితండాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గత అనుభవాలను దృష్టిపెట్టుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు సరైనా భద్రత కల్పించలేదనే ఆరోపణలు ఉన్నాయి.