వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అధికారంలో లేకపోయినా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జగన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో పులివెందుల నియోజకవర్గంలో అకాల వర్షాలు కురవడం వల్ల పంటలు భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో, లింగాల మండలంలోని నష్టపోయిన రైతులను స్వయంగా పరామర్శించిన జగన్, వారికి ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ హామీ అమలులో భాగంగా, ఆయా ప్రాంతాల రైతులకు పార్టీ తరఫున సాయం అందించారు. మొత్తం 670 మంది రైతులకు ఒక్కో హెక్టారుకు రూ.20,000 చొప్పున రూ.1.14 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేశారు. రైతుల సంతృప్తికర స్పందనతో పాటు, జగన్ నిర్ణయం వారికి నూతన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని గ్రామస్తులు పేర్కొన్నారు.
అధికారంలోకి లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం 670 మంది రైతులకు పార్టీ తరఫున సాయం అందించిన జగన్పై రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సపోర్టు అందకపోయినా, నష్టపోయిన పంటలను పరిశీలించి తమను ఆదుకున్నాడని, హెక్టార్కు రూ.20 వేల చొప్పున సాయం అందించాడన్నారు. అధికారంలో ఉన్నప్పుడు డీబీటీ ద్వారా అర్హలైన అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న జగన్.. అధికారంలో లేకపోయినప్పటికీ మానవత్వంతో ఆదుకుంటున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.