రెంటపాళ్ల (Rentapalla) పర్యటనలో సింగయ్య (Singayya) మృతి(Death) పై మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Ys Jagan) స్పందించారు. ముఖ్యమంత్రి(CM) నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu)పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ జగన్ చేసిన ట్వీట్(Tweet) సంచలనంగా మారింది. చంద్రబాబు కుట్ర రాజకీయాలతో రాష్ట్ర రాజకీయ స్థాయిని దిగజార్చారని, తన పర్యటనలపై ఆంక్షలు విధించి, జడ్ ప్లస్ సెక్యూరిటీ (Z Plus Security) ప్రొటోకాల్ (Protocol)ను పాటించకుండా డైవర్షన్ రాజకీయాలు ఆడుతున్నారని జగన్ ఆరోపించారు. సత్తెనపల్లి నియోజకవర్గం (Sattenapalli Constituency)లో జరిగిన దురదృష్టకర ఘటనను రాజకీయంగా వాడుకుంటూ, తనపై విషప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా కార్యకర్తలు, రైతుల సమస్యలపై (Farmers Problems) సంఘీభావం తెలపడానికి వెళ్లడం తప్పా అని ప్రశ్నిస్తూ, చంద్రబాబు పాలనలో అవినీతి, వైఫల్యాలను ఎండగడుతున్నందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని జగన్ మండిపడ్డారు.
తన ఎక్స్ ఖాతా నుంచి చేసిన పోస్ట్లో, చంద్రబాబును పలు ప్రశ్నలతో నిలదీశారు వైఎస్ జగన్. “మాజీ ముఖ్యమంత్రిగా నాకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఆటోమేటిక్ హక్కు కాదా? ఈ సెక్యూరిటీని రాజకీయ కారణాలతో విత్డ్రా చేసే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉందా?” అని ప్రశ్నించారు. “నా పర్యటనకు రూట్ మ్యాప్ ఇచ్చినప్పటికీ, పైలట్ వాహనాలు, రోప్ పార్టీలు లేకుండా చేసి, భద్రతలో లోపం జరిగిందా? లేక వాహనం కింద ఎవరూ పడలేదా? ఏది వాస్తవం?” అని చంద్రబాబును సవాల్ చేశారు. ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం అందించకపోవడంతో తానే సొంత ఖర్చుతో కొనుగోలు చేశానని, అయినప్పటికీ ప్రభుత్వ డ్రైవర్, సెక్యూరిటీ బాధ్యతలు ప్రభుత్వంపైనే ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. సత్తెనపల్లి ఘటనను రాజకీయంగా వాడుకుంటూ, తనపై విషప్రచారం చేయడం హేయమని, చంద్రబాబు ఎస్పీ స్టేట్మెంట్పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో జరిగిన దురదృష్టకర ఘటనపై తాము మానవీయంగా స్పందించామని జగన్ వెల్లడించారు. “ఘటన తెలియగానే మా నాయకులు బాలసాని కిరణ్, అంబటి రాంబాబు ఆసుపత్రికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించాలని ఆదేశించాను. గుండెపోటుతో మరణించిన మరో అభిమాని కుటుంబానికి కూడా సహాయం చేశాం,” అని తెలిపారు. చంద్రబాబు తన పర్యటనల్లో జరిగిన మరణాలపై ఎటువంటి సాయం చేశారని ప్రశ్నిస్తూ, మానవత్వం, నైతికత గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అవినీతి, రెడ్బుక్ రాజ్యాంగం, రైతుల దుస్థితిని ఎత్తిచూపే తన ప్రెస్ మీట్లకు సమాధానం చెప్పలేక, ప్రజల్లో తనపై ఉన్న ప్రేమను చూసి ఓర్చుకోలేక ఈ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. “కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి” అని చంద్రబాబును ఉద్దేశించి హెచ్చరించారు.
•@ncbn గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 23, 2025
•చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరుకాని, మీ పవన్కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు…