అసెంబ్లీకి హాజ‌రైన వైఎస్ జ‌గ‌న్‌

అసెంబ్లీకి హాజ‌రైన వైఎస్ జ‌గ‌న్‌

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. వైసీపీ సభ్యులతో పాటు వైఎస్ జగన్ సభకు హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి అని వైసీపీ స‌భ్యులు డిమాండ్ చేశారు. ప్రజా స‌మ‌స్య‌లు స‌భ‌లో వినిపించాలంటే వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడండి అని నిరసన వ్య‌క్తం చేశారు. వైసీపీ ఆందోళ‌న‌ను ప‌ట్టించుకోకుండా గ‌వ‌ర్న‌ర్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం కొన‌సాగిస్తుండ‌గా.. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బ‌హిష్క‌రించింది. స‌భ నుంచి ప్ర‌తిప‌క్ష స‌భ్యులంతా వాకౌట్ చేశారు.

ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను సభ దృష్టికి తీసుకురాగ‌లం, ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు వినిపించ‌గం అని వైసీపీ ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తిప‌క్ష హోదా కోసం గ‌తంలో స్పీక‌ర్‌కు సైతం లేఖ రాసింది. ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్ త‌న ప్రెస్‌మీట్‌లో ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే స‌భా నాయ‌కుడితో స‌మానంగా మాట్లాడేందుకు స‌మ‌యం ఉంటుంద‌ని, అప్పుడే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను అనుకున్న స్థాయిలో స‌భ‌కు వివ‌రించ‌గ‌ల‌మ‌ని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment