అంద‌రినీ గుర్తుపెట్టుకుంటాం – పేర్ని కిట్టు

అంద‌రినీ గుర్తుపెట్టుకుంటాం - పేర్ని కిట్టు

పోసాని కృష్ణమురళీ అక్రమ అరెస్ట్‌ను మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ పేర్ని కిట్టు తీవ్రంగా ఖండించారు. మ‌చిలీప‌ట్నంలో పేర్ని కిట్టు మీడియాతో మాట్లాడారు. ఏపీలో అరెస్టుల పర్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుచేస్తోందన్నారు. ఇలాంటి ఘటనలను ఇంతకుముందెన్నడూ ఎక్కడా జరగలేదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేస్తున్నారని, మ‌రి టీడీపీ, జ‌న‌సేన పెట్టిన పోస్టుల సంగతేంటి అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులకు పర్యవసానం కచ్చితంగా అనుభవిస్తారని, రూల్స్ దాటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారులను గుర్తు పెట్టుకుంటామ‌ని పేర్ని కిట్టు హెచ్చ‌రించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment