వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణలోని రేవంత్రెడ్డి ప్రభుత్వానికి పరోక్షంగా చురకలు అంటిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెల్బోర్న్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గవ టెస్టులో నితీష్రెడ్డి హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ వీడియోని పోస్టు చేసి.. “ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న ‘పుష్ప’…. హీరోని వేధిస్తూ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా?” అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న
— Ambati Rambabu (@AmbatiRambabu) December 28, 2024
"పుష్ప"…….. హీరోని వేధిస్తూ
తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి
తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా ? pic.twitter.com/0b3C7XjpZR
నితీష్రెడ్డి హాఫ్ సెంచరీ పూర్తిచేసిన తరువాత తగ్గేదే లే అంటూ తన బ్యాట్తో పుష్ప మ్యానరిజాన్ని ప్రదర్శించాడు. దీంతో నితీష్ వీడియోను ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వానికి చురకలు అంటిస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలపై వ్యంగ్యంగా కామెంట్ చేశారని అనేక మంది అభిప్రాయపడ్డారు. అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
కాగా, ఈ పోస్టులో ఎవరి పేరూ మెన్షన్ చేయలేదు. మరి పరోక్ష సెటైర్లపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుందో వేచి చూడాలి.