44 పరుగులకే విండీస్ ఆలౌట్!

44 పరుగులకే విండీస్ ఆలౌట్!

మలేషియాలో జరుగుతున్న మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో, భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన క‌న‌బ‌రిచారు. టీమిండియా బౌల‌ర్ల దాటికి విండీస్ బ్యాటర్లు విల‌విల్లాడిపోయారు. మొత్తం 13.2 ఓవర్లలో కేవలం 44 పరుగులకే విండీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. భారత ఫీల్డింగ్ కూడా అదిరిపోయింది, ముగ్గురు విండీస్ బ్యాటర్లను రనౌట్ చేసి మ్యాచ్‌పై పట్టు నిలుపుకున్నారు. భారత బౌలింగ్ పరంపరలో జోషిత, సిసోడియా ఇద్దరు చొప్పున వికెట్లు తీసి మెరవగా, పరుణిక మూడు కీలక వికెట్లు పడగొట్టింది. విండీస్ జట్టుకి భారత బౌలర్ల దాడి నుంచి బయటపడటం అసాధ్యం అయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment