మంగళగిరి నియోజకవర్గంలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా గుర్తించారు.
కుటుంబ పోషణ కోసం క్యాటరింగ్ పనులు చేసుకునే ఆమె, నిన్న ఉదయం విజయవాడకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే కొలనుకొండ సమీపంలోని ముళ్లపొదల్లో ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.