విశాఖపట్నం (Visakhapatnam) లో స్కూల్ విద్యార్థులకు (School Students) తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పిల్లల ప్రాణాలను మద్యం మత్తులో ఆటో డ్రైవర్ (Auto Driver) పణంగా పెట్టాడు. ఫుల్టుగా మద్యం (Alcohol) సేవించి డ్రైవర్ను తన ఆటోను డివైడర్ను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు (Six Students) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు స్పందించి గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రైవర్పై కేసు నమోదు.. రిమాండ్కు తరలింపు
ప్రమాద ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆటో డ్రైవర్కి బ్రీత్ ఎనలైజర్ (Breathalyzer Test) టెస్ట్ నిర్వహించగా, అతని రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు 550 పాయింట్లు నమోదయ్యాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో పాటు మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైన కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు.