భారత్-పాక్ (India-Pakistan) ఉద్రికత్తల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ (Union Home Ministry) రాష్ట్ర ప్రభుత్వాలను (State Governments) అలర్ట్ చేసింది. దేశంలోని 244 జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ (Civil Mock Drills) నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం దేశంలో ఎంపిక చేసిన జిల్లాల్లోని ముఖ్య ప్రదేశాలలో ఈ డ్రిల్ చేపట్టనున్నారు. దీని ద్వారా మాక్ డ్రిల్స్లో భాగంగా పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు అధికారులు. పహల్గామ్ (Pahalgam) వంటి ఉగ్రదాడులు (Terror Attacks) జరిగితే వాటిని దీటుగా ఎదుర్కోవడం ఎలాగో పౌరులకు నేర్పిస్తారు. ఏయే ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో అన్నీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది.
మూడు కేటగిరీల్లో ప్రాంతాలు
సివిల్ మాక్ డ్రిల్పై యూనియన్ హోంశాఖ కార్యదర్శి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నీ రాష్ట్రాల సెక్రటరీలు, డీజీపీలు, ఫైర్ డీజీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ ప్రాంతాల్లో ఎలా మాక్ డ్రిల్ నిర్వహించాలో ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలు మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరి-1లో దేశ రాజధాని ఢిల్లీ , తారాపూర్ అణు కేంద్రం, కేటగిరి-2లో విశాఖపట్నం (Visakhapatnam), హైదరాబాద్ (Hyderabad) ప్రాంతాలను గుర్తించారు.
సిద్ధమవుతున్న విశాఖ..
విశాఖలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు తూర్పు నేవిక దళం సిద్ధమవుతోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంతో కలిసి తూర్పు నేవిక దళం మాక్ డ్రిల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సాగర జలాల్లో దూకుడు గా సన్ రైజ్ ఫ్లీట్ నిర్వహిస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో సిద్ధంగా ఉన్న INS విశాఖ, INS సూరత్, INS ముర్మఘం, INS కొచ్చి వంటి యుద్ధ నౌకలు సిద్ధమవుతున్నాయి. వార్ షిప్స్, సబ్ మెరైన్లలో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.