వ‌ర్మ‌ కావాలంటున్న పిఠాపురం ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్

వ‌ర్మ‌ కావాలంటున్న పిఠాపురం ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కూటమి పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) కు సీటు త్యాగం చేసిన టీడీపీ నేత వర్మ (Varma) పై అక్కడి ప్రజలు ఇప్పటికీ మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ వర్మను మళ్లీ పోటీ (Contest) చేయాలని కోరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో ఆ మహిళ, వచ్చే ఎన్నికల్లో మళ్లీ బరిలో దిగాలని వర్మను కోరగా, ఆయన చిరునవ్వుతో “నిలబడతాను (I will contest)” అంటూ సమాధానమిచ్చారు. ఈ ఘటన, పిఠాపురం ప్రజల్లో వర్మకు ఉన్న ఆదరణను చాటుతోంది. రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా, ఆయనపై స్థానికంగా సానుకూలత కొనసాగుతోందని ఈ వీడియో రుజువు చేస్తోంది.

నాగ‌బాబు కామెంట్స్‌పై దుమారం
ఈనెలలో పిఠాపురం వేదిక‌గా జ‌రిగిన జ‌న‌సేన పార్టీ (Janasena Party) ఆవిర్భావ స‌భ‌లో ఆ పార్టీ నేత నాగ‌బాబు (Nagababu) చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి రెండే ప్రధాన అంశాలు అని, పవన్ కళ్యాణ్ మరియు పిఠాపురం ప్రజలని అన్నారు. పవన్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే, అది వారి వారి ఖర్మ మాత్రమేనని నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌లపై వ‌ర్మ అనుచ‌రులు, టీడీపీ (TDP) కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ (5 MLC) స్థానాల్లో వ‌ర్మ‌కు చోటు ఉంటుంద‌ని భావించ‌గా, లిస్ట్‌లో ఆయ‌న పేరు లేక‌పోవ‌డం కూడా పిఠాపురం ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఆగ్ర‌హానికి గురిచేసింది.

ఇప్ప‌టికిప్పుడు ఇండిపెండెంట్‌గా నిల‌బ‌డినా..
ఈ రెండు అంశాలతో పాటు వ‌ర్మ‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానం ఆయ‌న‌పై సానుభూతిని పెంచేశాయ‌ని తెలుస్తోంది. ఈసారి సీటు ఎవ్వ‌రికీ త్యాగం చేయ‌కుండా తానే అభ్య‌ర్థిగా నిల‌బ‌డాల‌నే డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్ప‌టికిప్పుడు ఇండిపెండెంట్ (Independent) అభ్య‌ర్థిగా నిల‌బ‌డినా భారీ మెజార్టీతో గెలుపొందుతార‌ని పిఠాపురం ప్ర‌జ‌లే చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment