Vinukonda : క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

Vinukonda : క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

క్రీడా మైదానంలో ఆహ్లాదంగా సాగుతున్న‌ క్రికెట్ టోర్నమెంట్ ఒక్కసారిగా విషాదంగా మారింది. ప‌ల్నాడు జిల్లా (Palnadu District) వినుకొండ‌ (Vinukonda)లో క్రికెట్ టోర్న‌మెంట్ (Cricket Tournament) నిర్వ‌హిస్తున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్న గౌస్ బాషా (చంటి) (Ghouse Basha (Chanti)) అనే యువకుడు ఆట మధ్యలోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ కొద్దిసేప‌టికే మృతి చెందాడు. కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) (గుండెపోటు)తో మ‌ర‌ణించిన‌ట్లుగా వైద్యులు ధ్రువీక‌రించారు. మృతుడు చంటికి మూడేళ్ల క్రితమే వివాహం అయ్యింది. చంటి ఆకస్మిక మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

యుక్త‌వ‌య‌స్సు వారికి హార్ట్ ఎటాక్స్‌
ఇటీవ‌ల మేడ్చ‌ల్‌లోని సీఎంఆర్ క‌ళాశాల‌లో (CMR College) క్రికెట్ (Cricket) ఆడుతూ బీటెక్ విద్యార్థి (B.Tech Student) ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థి ఒక‌రు.. థ‌ర్డ్ ఇయ‌ర్ స్టూడెంట్ ఒక‌రు మృతిచెందిన విష‌యం తెలిసిందే. మ‌హారాష్ట్ర‌లోని ప‌రండాలో ఓ కాలేజీ ఫంక్ష‌న్‌లో అప్ప‌టి వ‌ర‌కు న‌వ్వుకుంటూ మాట్లాడుతున్న 20 ఏళ్ల యువ‌తి ఒక్క‌సారిగా కుప్ప‌కూలి గుండెపోటుతో (Heart Attack) మ‌ర‌ణించింది. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment