వైసీపీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) పై మరో ఫిర్యాదు నమోదైంది. గతంలో స్టోన్ క్రషర్ (Stone Crusher) యజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైన రజినిపై, ఇప్పుడు కొత్తగా చిలకలూరిపేట (Chilakaluripet) కు చెందిన సుబ్రహ్మణ్యం (Subrahmanyam) అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2022లో విధ్వంసం చేశారని..
రావు సుబ్రహ్మణ్యం 2022 ఏప్రిల్లో రజిని అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి 100 మందికి పైగా వచ్చి తన ఇంట్లో విధ్వంసం సృష్టించారని ఆయన ఆరోపించారు. ఫర్నిచర్, కారు ధ్వంసం చేయడంతో పాటు తన కుటుంబాన్ని మానసికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో విడదల రజిని (Vidadala Rajini) , ఆమె మరిది విడదల గోపి (Vidadala Gopi) పేర్లు చేర్చి న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
ఇప్పటికే రజినిపై పల్నాడు జిల్లా యడ్లపాడు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ (Sri Lakshmi Balaji Stone Crusher) కేసులో అవినీతి (Corruption) ఆరోపణలు ఎదురవుతున్నాయి. కాగా, విడదల రజినీని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని వైసీపీ (YCP) నేతలు ఆరోపిస్తున్నారు. అన్యాయం జరిగితే 10 నెలలుగా సెలైంట్గా ఎందుకు ఉన్నారని, ఇప్పుడు ఎవరి ప్రోద్బలంతో కేసులు పెడుతున్నారని వైసీపీ క్యాడర్ విమర్శలు చేస్తోంది.