బీహార్ (Bihar) రాష్ట్రం గయా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి (Union Minister) జితన్ రామ్ మాంఝి (Jitan Ram Manjhi) మనవరాలు (GrandDaughter) సుష్మా దేవి (Sushma Devi) (32) హత్యకు (Murder) గురయ్యారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆమె భర్త రమేశ్ (Ramesh) నాటు తుపాకీ (Gun) తో కాల్చి చంపినట్టు తెలుస్తోంది.
వివాదాలే హత్యకు దారి?
దంపతుల మధ్య గత కొంత కాలంగా తలెత్తిన గొడవలే ఈ దారుణానికి కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, పూర్తి విషయాలు ఇంకా బయటపడాల్సి ఉంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెలుగు చూడనున్నాయి.







