తిరుపతి (Tirupati) లోని శ్రీ వేంకటేశ్వర గోశాల (Sri Venkateswara Goshala) లో ఇటీవల జరిగిన ఆవుల మృతి (Cow Deaths) ఘటనపై టీటీడీ ఈవో(TTD-EO) శ్యామలరావు (Shyamal Rao) స్పందించారు. “మూడు నెలల్లో వంద ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు (Allegations) అసత్యమని (False), గడిచిన మూడు నెలల్లో 43 ఆవులే చనిపోయాయి. సాధారణంగా నెలకు సగటున 15 ఆవులు మృతిచెందడం సహజం” అని వివరించారు. ఆవుల మృతిపై పోస్టుమార్టం జరగలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. “ఆ ఆరోపణ పూర్తిగా అవాస్తవం. మృతిచెందిన ప్రతి ఆవుపై తగిన ప్రక్రియలు పూర్తి చేశాం. చాలా ఆవులు దాతల నుంచి తీసుకున్నవే, అవి ముందే అనారోగ్యంతో బాధపడుతున్నాయి” అన్నారు.
కాగా, గోశాలలో ఆవులు మృతిచెందుతున్నాయని ఫొటోలను (Photos) బయటపెట్టిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy) పై ఈవో శ్యామలరావు పలు ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో గోశాలలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మృతిచెందిన ఆవుల వివరాలు దాచారని, గోశాలలో లేని ఆవులకూ దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. 2023లో విజిలెన్స్ అధికారులను గోశాలలోకి అనుమతించలేదు. అవినీతి బయటపడుతుందన్న భయంతో అలా చేశారు అని ఆరోపించారు. భూమన గోవుల మృతి విషయాన్ని లేవనెత్తిన తరువాత ఈవో నుంచి భూమనపై ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలకు కౌంటర్
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy) హిందువే కాదని (Not A Hindu), వారి పిల్లల పెళ్లీళ్లు ఏ సంప్రదాయ ప్రకారం (Hindu Tradition) చేశాడో చూశామంటూ ఆరోపణలు చేశారు. టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలపై నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. హిందూ సంప్రదాయ ప్రకారం జరిగిన భూమన అభినయ్రెడ్డి (Bhumana Abhinay Reddy) పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా పోస్టు చేస్తున్నారు. ఆ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. ఉన్నతమైన హోదాలో ఉన్న బీఆర్ నాయుడు (B.R. Naidu) కాస్త పరిశీలన చేసుకొని ఆరోపణలు చేస్తే బాగుంటుందని సలహా (Advice) ఇస్తున్నారు.
బీఆర్ నాయుడు గారు మీరు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, ఇదిగో సాక్ష్యాలు. భూమన కరుణాకర రెడ్డి గారి పిల్లలకు హిందూ సంప్రదాయ బద్ధంగా వివాహం జరిగిన ఫోటోలు, వీడియోలు@Bhumana_Abhinay pic.twitter.com/lHEqtykt5c
— TOVINO𓃵 (@Vamos_Rafa23) April 14, 2025