అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. బైడెన్ ఇటీవల 37 మంది ఖైదీలకు మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చిన విషయం వివాదాస్పదంగా మారింది. ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
“జో బైడెన్ 37 మంది హంతకుల మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు. ఈ హంతకులు చేసిన క్రూరత్వాలను తెలుసుకున్నప్పుడు బైడెన్ నిర్ణయం నమ్మలేం. బాధితుల కుటుంబ సభ్యుల బాధ అంచనా వేయలేం” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫాంలో పేర్కొన్నారు.
ట్రంప్ అభిప్రాయం ప్రకారం.. బైడెన్ తన అధికారంలో ఉన్నపుడు మరణశిక్షపై కొన్ని మార్పులు చేయడం, రాబోయే రోజుల్లో ఈ శిక్షపై మరింత సడలింపులు ఉండే అవకాశం ఉన్నట్లు సూచిస్తోంది. ఆయన అంచనా ప్రకారం, ట్రంప్ తిరిగి అధికారంలోకి రాగానే ఈ మారటోరియం ఎత్తేయాలని అనుకుంటున్నారు.