దళిత విద్యార్థిపై దాడి.. ప్ర‌భుత్వంపై జగన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

దళిత విద్యార్థిపై దాడి.. ప్ర‌భుత్వంపై జగన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)‌లోని తిరుపతి (Tirupati) లో ఇంజినీరింగ్ (Engineering) చదువుతున్న దళిత విద్యార్థి (Dalit Student) జేమ్స్‌(James)‌పై జరిగిన దారుణమైన దాడిని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన, విద్యార్థిని కిడ్నాప్ చేసి, దారుణంగా దాడి చేసిన సంఘటన, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే ఆందోళనలను తెరపైకి తెచ్చింది.

ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో జగన్ మోహన్ రెడ్డి ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “తిరుపతిలో దళిత ఇంజినీరింగ్ విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలకు నిదర్శనం. దళితులు, తమ గొంతు వినిపించలేని వర్గాల వారికి ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది” అని పేర్కొన్నారు.

నివేదికల ప్రకారం, జేమ్స్‌ను అపహరించి, ఒకటిన్నర రోజుల పాటు తీవ్రంగా శారీరక దాడికి గురిచేశారు. రూపేష్ అనే రౌడీషీటర్ నేతృత్వంలోని “చోటా బ్లేడ్”(“Chota Blade) గ్యాంగ్ (Gang)సభ్యులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో బాధితుడిపై కత్తులు, హాకీ స్టిక్‌లతో దాడి చేసి, తీవ్ర గాయాలు కలిగించారు. అంతేకాకుండా మూత్రం తాగించి త‌న‌ను చిత్ర హింస‌ల‌కు గురిచేశార‌ని బాధితుడు క‌న్నీరు పెట్టుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ ఘ‌ట‌న‌పై జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), అధికార తెలుగుదేశం పార్టీని (Telugu Desam Party – TDP) తీవ్రంగా విమర్శించారు. బలహీన వర్గాల రక్షణలో విఫలమైన ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాన్ని రాజకీయంగా ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. “దళితులపై దాడులు పెరుగుతున్నాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమవుతున్నాయి. బలహీన వర్గాలు, అన్యాయంపై గొంతు విప్పే వారికి రక్షణ లేదు. అధికారపార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్షసాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను.” అని ఆయన అన్నారు.

వైసీపీ నాయకులు, విద్యార్థి సంఘాలు సోషల్ మీడియాలో ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. దోషులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో బలహీన వర్గాల భద్రత, కుల ఆధారిత హింస, అరాచ‌కాల‌ను అరికట్టాల‌న్న డిమాండ్లు వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment