తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద, అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. తిరుమల ఘాట్ రోడ్లపై తాజాగా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులంతా రోడ్లపై అధిక జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. ముఖ్యంగా ఘాట్ రోడ్లపై డ్రైవింగ్ చేయేటప్పుడు వేగం నియంత్రించి, ఖచ్చితమైన నియమాలు పాటించాలని కోరుతోంది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025
తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం
మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా
నలుగురు భక్తులకు గాయాలు.. అశ్విని ఆసుపత్రికి తరలింపు https://t.co/sNYubMfNhx pic.twitter.com/QanxcJ1176
తిరుమలలో జరుగుతున్న వరస ఘటనలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. ఆ తరువాత లడ్డూ ప్రసాద కౌంటర్ వద్ద అగ్ని ప్రమాదం, పరకామణిలో బంగారం బిస్కెట్ దొంగతనం, ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం, పవిత్రమైన కొండపై కోడిగుడ్ల పలావ్, తాజాగా కారు ప్రమాదం.. ఇలా వరసగా జరుగుతున్న ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.