స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ను హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ గట్టెక్కించాడు. ఒంటరి పోరాటం చేసి జట్టును విజయ తీరానికి చేర్చాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. 20 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టును 165 పరుగులకు కట్టడి చేయగలిగారు. తొమ్మిది వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 165 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ పూర్తిచేసింది.
సెకండ్ ఇన్నింగ్స్లో 166 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా. స్వల్ప స్కోర్కే టాప్ ఆర్డర్స్ను కోల్పోయింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన జట్టును తెలుగు తేజం తిలక్ వర్మ ఆదుకున్నాడు. చివరి వరకు ఒంటరి పోరాటం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. టాప్ ఆర్డర్స్ అంతా విఫలమైనా.. తాను మాత్రం నిలకడగా ఆడి చివరకు క్రీజ్లో ఉన్నాడు. వన్ డౌన్లో వచ్చిన తిలక్ వర్మ 55 బంతుల్లో 72 స్కోర్ చేశాడు. ఐదు సిక్సర్స్, నాలుగు ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తిలక్ వర్మ వండర్ ఫుల్ బ్యాటింగ్తో ఇండియా రెండు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కెప్టెన్ బట్లర్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. 30 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరఫున తిలక్ వర్మ 72 పరుగులు చేసి అత్యధిక మ్యాచ్ టాప్ బ్యాట్స్మెన్గా నిలిచాడు.