భారత్-పాక్‌ యుద్ధం.. తెలుగు జవాన్ వీర మరణం

భారత్-పాక్‌ యుద్ధం.. తెలుగు జవాన్ వీర మరణం

భారత్- పాకిస్తాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ సైన్యం తరచూ కాల్పులకు తెగబడుతుండగా, భారత సైన్యం వారికి దీటుగా బ‌దులిస్తోంది.

ఈ నేపథ్యంలో, జమ్మూకాశ్మీర్‌ (Jammu-Kashmir)లో పాక్ సైన్యం (Pakistani Army) జరిపిన కాల్పుల్లో (Firing) ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు చెందిన ఓ తెలుగు జవాన్ (Telugu Soldier) వీరమరణం (Heroic Death) పొందారు. మృతిచెందిన జవాన్‌ను మురళీనాయక్‌ (Murali Nayak)గా గుర్తించారు. ఆయన సత్యసాయి (Sathya Sai) జిల్లాలోని కల్లితండా వాసి. జ‌వాన్ ముర‌ళినాయ‌క్ వీర‌మ‌ర‌ణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మురళీనాయక్ మృతదేహాన్ని రేపు స్వస్థలానికి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. అంత్యక్రియలు పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మురళీనాయక్‌కు దేశ ప్ర‌జ‌లంతా నివాళుల‌ర్పిస్తున్నారు. ఆయన త్యాగం భారతదేశ సైనికుల ధైర్యాన్ని ప్రతిబింబిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment