తెలంగాణ (Telangana) మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కేబినెట్ సమావేశానికి (Cabinet Meeting) ముందు స్వల్ప అస్వస్థతకు (Mild Illness) గురయ్యారు. సెక్రటేరియట్ (Secretariat)లోని కేబినెట్ హాలులో ఆమెకు కళ్లు తిరిగి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్రటేరియట్ సిబ్బంది వైద్యుల సహాయంతో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. లో బ్లడ్ ప్రెషర్ (లో బీపీ) కారణంగా ఈ ఘటన జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం కొండా సురేఖ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా, గురువారం (జూన్ 5) మధ్యాహ్నం ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి పథకాలపై చర్చించనున్నారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఏ నివేదికపై సమీక్ష జరపనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలతో పాటు, వేములవాడలో కోడెలు మృతిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.