కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు బహిరంగంగా వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది. భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
”నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు” అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహంతో ఊగిపోయారు. ”లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు అందుబాటులో లేరు. మీరు లేకపోవడంతో కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించాం” అంటూ విష్ణుకుమార్ రాజు వివరణ ఇచ్చుకున్నారు.
ఇద్దరు కూటమి నేతల మధ్య ఫిలింనగర్ క్లబ్కు సంబంధించిన లీజు అంశం వివాదానికి కారణమైనట్లుగా అర్థమవుతోంది. లీజు విషయంలో ఎమ్మెల్యేలిద్దరూ బహిరంగంగా వాగ్వాదం చేసుకోవడం సంచలనంగా మారింది.
నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంటీ..?
— Telugu Feed (@Telugufeedsite) April 26, 2025
కూటమి నేతల మధ్య బయటపడ్డ విభేదాలు..
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం
నా నియోజకవర్గంలో వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు.
– విష్ణుకుమార్ రాజుపై గంటా ఆగ్రహం#AndhraPradesh #TDP #BJP pic.twitter.com/asLBpWCfet