టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం

టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం

రాజ్యసభలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రలోభాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. నూతన ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపుల రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.

ప్ర‌జాస్వామ్యాన్ని కించ‌ప‌రిచేలా..
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స‌భ‌లో మాట్లాడుతూ.. “టీడీపీ ప్రలోభాల వల్లనే వైసీపీకి చెందిన ఎంపీలు ఆ పార్టీలో చేరిపోయార‌ని, బెదిరింపులు, ప్రలోభాలు టీడీపీ ముఖ్యమైన ఆయుధాలుగా మారాయని ధ్వ‌జ‌మెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిప‌డ్డారు.

రాజ్యసభ చైర్మన్ స్పందన
వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, ఈ విమర్శలు రికార్డుల్లోకి వెళ్లవని స్పష్టంచేశారు. అయినప్పటికీ, విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో రాజకీయ ఉత్కంఠను కలిగించాయి.

TDP ఎంపీల ప్రమాణస్వీకారం
నేడు రాజ్యసభలో నూత‌నంగా ఎంపికైన‌ ఎంపీలు సాన సతీష్‌, బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్యలు ప్రమాణం చేశారు. ఈ సందర్భంలో విజ‌య‌సాయిరెడ్డి చేసిన రాజకీయ ఆరోపణలు మరింత చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. బీద మ‌స్తాన్‌రావు, ఆర్‌.కృష్ణ‌య్య‌, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. త‌రువాత కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీలో చేరి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. తాజాగా బీద మ‌స్తాన్‌రావు, కృష్ణ‌య్యల‌కు మాత్ర‌మే టీడీపీ అవ‌కాశం ఇచ్చింది. మోపిదేవిని ప‌క్క‌న‌బెట్టింది.

Join WhatsApp

Join Now

Leave a Comment