మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి కామెడీ టచ్, చిరంజీవి టైమింగ్ కలవడంతో ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో, సినిమాకు కమర్షియల్ హంగులు అద్దేందుకు గాను, ఇందులో ఓ స్పెషల్ సాంగ్ను చేర్చినట్టు తాజా సమాచారం.
ఈ ఐటమ్ నంబర్లో గ్లామరస్ స్టార్ తమన్నా భాటియా స్టెప్పులేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే “కావాలయ్యో కావాలయ్యో,” “డా డా డాస్ సూపర్ హిట్” వంటి ఐటమ్ నంబర్స్తో తమన్నా మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో, ఈ సారి మెగాస్టార్తో కలిసి ఆమె మాస్ ఆడియన్స్కు పక్కా ఫీస్ట్ ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తోంది.
అనిల్ రావిపూడి ఈ స్పెషల్ సాంగ్ డిజైన్లో ప్రత్యేక శ్రద్ధ చూపగా, యూనిట్ ఈ పాట షూటింగ్ కోసం భారీ సెట్ను సిద్ధం చేస్తోందట. సినిమా కథాంశం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉన్నప్పటికీ, కమర్షియల్ విజయానికి ఈ మసాలా సాంగ్ అవసరమని భావించి దీన్ని జోడించినట్లు తెలుస్తోంది. ఈ పాటలో చిరంజీవి, తమన్నా ఎనర్జీకి ఎస్.ఎస్. థమన్ అందించే మ్యూజిక్ తోడై థియేటర్లలో పండుగ వాతావరణం సృష్టిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే, ఈ స్పెషల్ సాంగ్ గురించి చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.








