Legal News India

నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్..

నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్..

నటుడు మరియు నిర్మాత విశాల్ కు మద్రాస్ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో సంబంధించిన రుణ వివాదంలో కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ...

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు… గ్రూప్‌–1 ర్యాంకులు సక్రమం

గ్రూప్‌–1 ర్యాంకులపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీకి గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష విషయంలో భారీ ఊరట లభించింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సంచలన తీర్పు వెలువరించింది. ర్యాంకులను రద్దు చేస్తూ గతంలో సింగిల్‌ ...

“iBOMMA రవికి ఎదురుదెబ్బ..

“iBOMMA రవికి ఎదురుదెబ్బ..

నిషేధిత పైరసీ వెబ్‌సైట్ iBOMMA కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. iBOMMA నిర్వాహకుడు రవి (Ravi) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ (Bail Petition)ను నాంపల్లి కోర్టు (Nampally Court) తిరస్కరించింది. తనపై ...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లాయర్ దాడి యత్నం! దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం సృష్టించింది. సీజేఐ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతున్న సమయంలో, కిషోర్ రాకేష్ అనే వృద్ధ న్యాయవాది వేదిక దగ్గరకు దూసుకెళ్లి, ప్రధాన న్యాయమూర్తిపైకి షూ విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి ఆయన్ను అడ్డుకున్నారు. దాడికి యత్నించిన ఆ న్యాయవాది "సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే" (సనాతన్‌ను అవమానించడాన్ని మేము సహించం) అని గట్టిగా అరుస్తూ కనిపించాడు. భద్రతా సిబ్బంది ఆయన్ని కోర్టు గది నుంచి బయటకు లాక్కెళ్లిపోయారు. వివాదానికి కారణమైన సీజేఐ వ్యాఖ్యలు ఈ దాడి యత్నానికి ప్రధాన కారణం.. ఖజురహోలోని విష్ణువు విగ్రహం కేసు విచారణ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలే. ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీజేఐ వ్యాఖ్యలు: "మీరు మిమ్మల్ని విష్ణువు ఆరాధకుడిగా పిలుచుకుంటే... కొంచెం ప్రార్థన చేసి ధ్యానం చేయండి. వెళ్లి భగవంతుడినే దీనిపై చర్యలు తీసుకోమని అడగండి," అంటూ వ్యాఖ్యానించారు. "ఖజురహో ఒక పురావస్తు ప్రదేశం. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కిందకు వస్తుంది. వారి అనుమతి లేకుండా దీనిలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు, క్షమించండి" అని గవాయ్ స్పష్టం చేశారు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిరసన సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని పలువురు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది సత్యం సింగ్ రాజ్‌పుత్ సీజేఐకి బహిరంగ లేఖ రాస్తూ, వ్యాఖ్యలను పునః పరిశీలించాలని లేదా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరో న్యాయవాది వినీత్ జిందాల్ రాష్ట్రపతికి లేఖ రాసి, హిందూ భావాలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, దాడి యత్నం జరిగినప్పటికీ సీజేఐ గవాయ్ ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి, యథావిధిగా విచారణను కొనసాగించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌ (B.R. Gavai)పై ఓ న్యాయవాది (Lawyer) దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం ...

వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య (Murder) కేసు(Case)లో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క‌ వ్యాఖ్యలు చేసింది. నిందితుల‌ బెయిల్ రద్దు (Bail Cancellation)పై ...

తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే

తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న సుజయ్‌పాల్‌ను తాత్కాలిక సీజేగా నియమించారు. ఈ మార్పు జస్టిస్‌ ఆలోక్‌ అరాధే బాంబే ...