సిరియాలో మతపరమైన పాలనకు వ్యతిరేకంగా వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని డమాస్కస్లోని ఉమయ్యద్ చౌరస్తా వద్ద భారీగా గుమిగూడి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న సిరియా ప్రజలు, మహిళలకు సమాన హక్కులు కల్పించే ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
50 ఏళ్లకు పైగా నియంతృత్వ పాలనలో తాము నలిగిపోయామని, మతపరమైన పాలన తమకు వద్దు. ఇప్పుడయినా లౌకికతకు, ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని వారు నినాదాలు చేశారు.
మార్పు కోసం పోరాటం
ఈ నిరసనలు సిరియాలో ప్రజల అసంతృప్తిని, మార్పు అవసరాన్ని స్పష్టంగా చాటిచెప్తున్నాయి. మతపరమైన నియంత్రణకు బదులుగా ప్రజలు ఒక లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పోరాడుతున్నారు.