ఆసియా కప్ గెలుపు ఫీజుతో సూర్యకుమార్ యాదవ్ గొప్ప మనసు.

ఆసియా కప్ గెలుపు ఫీజుతో సూర్యకుమార్ యాదవ్ గొప్ప మనసు.

క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్  (Surya Kumar Yadav)  తన కెప్టెన్సీలో భారత్ ఆసియా కప్ (Asia Cup) 2025ను గెలుచుకున్న తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఆడిన మొత్తం ఏడు మ్యాచ్‌ల ఫీజు (Seven Matches Fees)ను భారత సైన్యానికి (Indian Army) విరాళంగా (Donation) ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ఫీజు వివరాలు:

బీసీసీఐ (BCCI) నియమావళి ప్రకారం, ఒక అంతర్జాతీయ T20 మ్యాచ్‌కు భారత క్రికెటర్లకు రూ. 3 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. టెస్ట్ మ్యాచ్‌లకు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు చెల్లిస్తారు. ఈ ఫీజులు పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా ఉంటాయి.

ఆసియా కప్ 2025లో సూర్యకుమార్ యాదవ్ 7 మ్యాచ్‌లు ఆడాడు. ఈ లెక్కన అతనికి లభించిన మొత్తం మ్యాచ్ ఫీజు రూ. 21 లక్షలు (7 x 3 లక్షలు). ఈ మొత్తాన్ని ఆయన భారత సైన్యానికి విరాళంగా ఇచ్చారు. ఈ నిర్ణయంపై ఎలాంటి వివాదం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment