కొమ్మినేనికి ఏం సంబంధం..? – ‘సుప్రీం’ కీల‌క వ్యాఖ్య‌లు

కొమ్మినేనికి ఏం సంబంధం..? - సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు

సీనియర్ జర్నలిస్ట్ (Senior Journalist) కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) (కెఎస్ఆర్)కు దేశ అత్యున్న‌త ధ‌ర్మాస‌నంలో (Court) ఊర‌ట (Relief) ల‌భించింది. కొమ్మినేన‌ని వెంట‌నే విడుదల (Release) చేయాలని సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశించింది. జస్టిస్ పీకే మిశ్రా (JusticeP.K. Mishra), జస్టిస్ మన్మోహన్‌ (Justice Manmohan)లతో కూడిన ధర్మాసనం, ఈ కేసులో భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై కీలక వ్యాఖ్యలు చేసింది. సాక్షి టీవీ (Sakshi TV)లో చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేనిపై కేసు నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. “చర్చలో ఇతరులు చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేనిని ఎలా అరెస్టు చేస్తారు? నవ్వినంత మాత్రాన కేసు పెడతారా? అలా అయితే మేము కూడా కోర్టులో నవ్వుతుంటాం” అని ధర్మాసనం సూచనాత్మకంగా వ్యాఖ్యానించిన‌ట్లుగా తెలుస్తోంది. కొమ్మినేని తరఫున సుప్రీం కోర్టులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) సహా న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు (Andhra Pradesh Police) కొమ్మినేనిని సోమవారం హైదరాబాద్‌ (Hyderabad)లోని ఆయన నివాసం నుంచి అరెస్టు (Arrested) చేసి, గుంటూరుకు తరలించారు. అమరావతి (Amaravati) రాజధాని ప్రాంత మహిళలపై (Women’s) అనుచిత వ్యాఖ్యలు (Inappropriate Comments) చేసిన ఓ విశ్లేషకుడి కామెంట్స్‌కు సంబంధించి కొమ్మినేనిపై ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 356(2) కింద కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు, ఈ సెక్షన్ల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తింది. “మూడేళ్ల శిక్షకు దారితీసే ఆరోపణల కోసం 35(3) బీఎన్ఎస్ఎస్ కింద నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారు? 70 ఏళ్ల వృద్ధుడిని ఇలా అరెస్టు చేయడం సమంజసమా?” అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి కొమ్మినేని విడుదలకు ఆదేశాలిచ్చింది.

విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. “ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం కీలకం. దానిని రక్షించడం మా బాధ్యత” అని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం అభిప్రాయ‌ప‌డింది. కొమ్మినేని అరెస్టు రాష్ట్ర‌వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు జర్నలిస్టుల హక్కుల రక్షణకు ఊపిరిలూదినట్లు భావిస్తున్నారు. ఈ తీర్పును ప‌లువురు జ‌ర్న‌లిస్టులు, వైసీపీ శ్రేణులు స్వాగతిస్తుండగా, సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment