పరీక్షల భయంతో ఓ విద్యార్థిని తన ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడింది. ఈ ఘటన మల్లారెడ్డి (Mallreddy) ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ (Engineering College)లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కీర్తి, పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయం (Exam Pressure)తో కళాశాల 4వ అంతస్తులోని కిటికీ నుంచి దూకేందుకు ప్రయత్నించింది (Student Suicide Attempt).
కాలేజీ బిల్డింగ్పై అంతస్థు కిటికీలో నుంచి దూకబోయిన విద్యార్థి కీర్తిని గమనించిన తోటి విద్యార్థులు సమయస్ఫూర్తి వ్యవహరించి ఆమెను రక్షించారు. కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో కాలేజీ యాజమాన్యంతో పాటు విద్యార్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను పలువురు విద్యార్థులు తమ ఫోన్లలో చిత్రీకరించడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.