కొంతమంది తారలు అందాన్ని కాపాడుకోవడానికి, మరింత మెరుగుపరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. ముక్కు, పెదాలు, నడుము వంటి శరీర భాగాలకు శస్త్రచికిత్సలు చేయించుకోవడం మనం చూస్తుంటాం. అయితే, ఒక హీరోయిన్ ఏకంగా 29 సర్జరీలు చేయించుకుందట. ఆమె ఇండస్ట్రీని ఏలిన పాన్ ఇండియా స్టార్, అతిలోక సుందరి శ్రీదేవి.
అందం కోసం ఇన్ని సర్జరీలు చేయించుకుందన్న వార్తలు వినిపిస్తున్న ఈ అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈ అందాల తార పుట్టినరోజు నేడు (జూన్ 14). ఆమె లేని లోటును అభిమానులు ఇప్పటికీ తీరని వేదనతో అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలామందికి దిగ్భ్రాంతిని కలిగిస్తుంది.
ఆమె ఫిబ్రవరి 24, 2018న దుబాయ్లోని ఓ హోటల్ బాత్టబ్లో మునిగి మరణించారు. శ్రీదేవి మరణంపై ఇప్పటికీ అనేక రకాల ఊహాగానాలు, కారణాలు ప్రచారంలో ఉన్నాయి.
శ్రీదేవి ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన మహారాణి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు ఎంతో కృషి చేశారు. తన అందాన్ని కాపాడుకోవడానికి శ్రీదేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని ప్రచారం ఉంది. ఆమె ఏకంగా 29 సర్జరీలు చేయించుకుందని బీ-టౌన్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.