ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2025)లో ఉప్పల్ వేదికగా జరిగిన హై-స్కోరింగ్ థ్రిల్లర్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (RR)పై విజయం సాధించింది. 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ పోరాడి ఓడింది. నిర్ణిత 20 ఓవర్లలో RR కేవలం 242 పరుగులు మాత్రమే చేయడంతో సన్రైజర్స్ విజయం సాధించింది.
RR జట్టు చివరి వరకు పోరాడినా, లక్ష్యం అందుకోవడంలో విఫలమైంది. జురేల్ (70) మరియు కెప్టెన్ శాంసన్ (66) మెరుగైన ఇన్నింగ్స్ ఆడినా, విజయం మాత్రం SRHదే అయ్యింది. RR చివరికి 6 వికెట్లు కోల్పోయి 242 పరుగుల వద్ద ఆగిపోయింది. SRH బౌలర్ సమర్జీత్ సింగ్ 2 కీలక వికెట్లు తీసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్లో సెంచరీ సాధించాడు. ఓపెన్ హెడ్ 67 పరుగులు చేసి జట్టు స్కోర్ను ముందుకు నడిపించాడు. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్మెన్స్ క్రీజ్లో ఉన్నంత సేపూ మెరుపు సిక్సర్ల బాదడంతో 20 ఓవర్లలో స్కోర్ వేగంగా 286 పరుగులకు చేరుకుంది.