టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పెనుప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. బుర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో, ఆయన ప్రయాణిస్తున్న కారుకు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని ఆపేశాడు.
దీంతో, గంగూలీ కారు డ్రైవర్ హుటాహుటిన బ్రేక్ వేశాడు. ఈ సమయంలో కాన్వాయ్లో ఉన్న మరో రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. అయితే, ఈ ఘటనలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగినప్పటికీ, ఆయన సురక్షితంగా ఉన్నారు. గంగూలీ ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.