SLBC ట‌న్నెల్ ప్ర‌మాదం.. 8 మంది మృత‌దేహాలు గుర్తింపు

SLBC ట‌న్నెల్ ప్ర‌మాదం.. 8 మంది మృత‌దేహాలు గుర్తింపు

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను వెలికితీయేందుకు గ‌త ఆరు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, శిథిలాల తొలగింపు ప్రక్రియలో మృతదేహాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్ద‌రు ఇంజినీర్లు కాగా, ఆరుగురు కార్మికులు ఉన్నారు.

అత్యాధునిక సాంకేతికతతో
కార్మికుల ఆచూకీ కోసం ప్రభుత్వం అత్యాధునిక గ్రావిటీ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) పరీక్షలు నిర్వహించింది. గురువారం టన్నెల్‌లోకి పంపించిన ఈ పరికరం ద్వారా శిథిలాల కింద మట్టిలో సుమారు మూడు మీటర్ల లోతులో కార్మికుల మృతదేహాలు ఉన్నట్లు కనుగొన్న అధికారులు, వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

టన్నెల్‌లో రక్షణ చర్యలు
ప్రమాద స్థలంలో సహాయ చర్యలను వేగవంతం చేయడానికి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) మిషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో జీరో గ్రావిటీ పెనెట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా భూమిలో చిక్కుకుపోయిన మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నించారు. టన్నెల్‌ను పూర్తిగా స్కాన్ చేసిన అనంతరం, ఎన్జీఆర్ఐ బృందం మృతదేహాలున్న ప్రదేశాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించింది. మృత‌దేహాల‌ను వెలికి తీసే ప‌నుల‌ను ముమ్మ‌రం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment