సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో (Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) చందనోత్సవం (Chandanotsavam) రోజున జరిగిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు (Seven Devotees) ప్రాణాలు విడిచారు. నాలుగు రోజుల ముందు కట్టిన గోడ (Wall) కూలి అప్పన్న నిజరూప దర్శనానికి (Appanna Nijaroopa Darshan) వచ్చిన భక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందడం స్థానికంగా విషాదం నింపింది.
నిజం ఒప్పుకున్న కాంట్రాక్టర్
అప్పన్న ఆలయంలో ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ.. ఆలయంలో ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టింది. త్రీమెన్ కమిటీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సమయం తక్కువ ఉందని తాను గోడ కట్టలేనని చెప్పినా, దేవాదాయ, టూరిజం అధికారుల ఒత్తిడితోనే నాలుగు రోజుల్లో గడను పూర్తిచేశానని కాంట్రాక్టర్ లక్ష్మణరావు (Contractor Lakshman Rao) చెప్పిన వీడియో ఇటీవల బయటపడి వైరల్ అయిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో గోడ కట్టడం సాధ్యం కాదని చెప్పినా, అధికారులు తనపై ఒత్తిడి తెచ్చి కట్టించారని కాంట్రాక్టర్ చెప్పడం విశేషం. చందనోత్సవానికి నాలుగురోజుల ముందు కట్టిన గోడ కూలడంతో ఏడుగురు మృతిచెందారు.
మంత్రుల కమిటీని విచారించరా..?
చందనోత్సవ ఏర్పాట్లపై ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించినప్పటికీ ఏర్పాట్లలో నిర్లక్ష్యం (Negligence) కొట్టొచ్చినట్లుగా కనిపించడం దారుణమంటున్నారు భక్తులు. మంత్రుల కమిటీ ఆలయంలోని సౌకర్యాలను తనిఖీ చేసిందా..? చేసి ఉంటే ఈ ప్రమాదం ఎందుకు జరగేది అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏర్పాటను అనువనువూ క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పిన హోంమంత్రి.. గోడ కూలిన తరువాత ఆ గోడను కాంక్రీట్తో కట్టారా, ఫ్లైయాష్తో కట్టారా, బ్రిక్స్తో కట్టారా అనేది తనకు తెలియదని చెప్పడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కూలిపోయిన గోడ నాలుగు రోజుల ముందు కట్టిందని మంత్రులకు తెలియదా..? ఈ ఘటనలో అధికారులను మాత్రమే విచారిస్తారా..? మంత్రుల కమిటీని విచారణ బృందం వివరణ కోరదా..? అని మృతుల కుటుంబీకులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాథమిక నివేదిక రెడీ..
ఈ ఘటనపై విచారణ చేపట్టిన కమిటీ.. కాసేపట్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపింది. ప్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేసారని, గోడ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని తేల్చారు. విచారణలో భాగంగా వివిధ శాఖల వారిని విచారించామని, వైధిక నియమాలను ఉల్లంఘించినట్టు ఆలయ అర్చకులు చెప్పారన్నారు. ఆగమశాస్త్ర పరమైన సలహాలు లేకుండానే గోడ నిర్మించారని వారు చెప్పినట్లుగా త్రీమెన్ కమిటీ వివరించింది. ఎవరి అనుమతితో మాస్టర్ ప్లాన్పై నిర్ణయాలు తీసుకున్నారో తేలాలన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం, నిబంధనల ఉల్లంఘన.. మొత్తంగా నిర్లక్ష్య వైఖరే కారణమని ప్రాథమిక రిపోర్టు (Preliminary Report) లో త్రీమెన్ కమిటీ (Three-Men Committee) తేల్చినట్లుగా సమాచారం.