ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం అంతర్జాతీయ టీమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఈ టోర్నమెంట్ పాకిస్థాన్ మరియు దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 కోసం అంబాసిడర్ల (Ambassadors)ను ప్రకటించింది.
ఈ టోర్నీకి భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) అంబాసిడర్ (Ambassador)గా ఎంపికయ్యాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత అయిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కూడా అంబాసిడర్లుగా ఎంపికయ్యారు.
ధావన్ ఇప్పటికే ICC టోర్నీల్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లలో ఒకడిగా పేరుపొందాడు. అతను 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీల్లో అద్భుతంగా ఆడి అత్యధిక పరుగులు సాధించాడు. ఈసారి అంబాసిడర్గా అతని కొత్త పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి!