శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

హైద‌రాబాద్ నివాసితుల‌ను హ‌డ‌లెత్తిస్తున్న హైడ్రా తాజాగా త‌న ఆప‌రేష‌న్‌ను శంషాబాద్‌కు షిఫ్ట్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సోమ‌వారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేప‌ట్టింది. ముఖ్యంగా సంపత్‌నగర్, ఊట్పల్లిల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన భవనాలతో పాటు, రోడ్లపై అడ్డుగా నిర్మించిన గేట్లను తొలగిస్తున్నట్లు సమాచారం.

సంపత్‌నగర్‌లో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు, ఇది ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోందని హైడ్రాకు ఫిర్యాదులు అందించిన నేప‌థ్యంలో సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకుని కూల్చివేతలు చేపట్టారు.

అక్రమ ఆక్రమణలపై కఠిన హెచ్చరికలు
ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వ భూములను అక్రమంగా ఉపయోగించుకోవద్దని, లేదంటే శాశ్వతంగా వాటిని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment