మ‌ద్యం మ‌త్తులో సీమరాజా హల్‌చల్.. యువ‌కుల‌పై దాడి!

మ‌ద్యం మ‌త్తులో సీమరాజా హల్‌చల్.. యువ‌కుల‌పై దాడి!

వైఎస్సార్ జిల్లా (YSR District)లో అర్ధ‌రాత్రి న‌డిరోడ్డుపై సీమ‌రాజా (Seema Raja) వీరంగం (Rampage) సృష్టించిన సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. కారు హార‌న్ (Horn) కొడితే ప‌క్క‌కు త‌ప్పుకోలేద‌ని ముగ్గురు యువ‌కుల‌ను (Youth) సీమ‌రాజా, మ‌రికొంద‌రు దాడి చేసిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాడికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌ముఖ యూట్యూబ‌ర్‌, వైసీపీ కండువా వేసుకొని టీడీపీ కోసం ప‌నిచేసే వ్య‌క్తిగా పేరుపొందిన సీమ‌రాజా వైఎస్సార్ జిల్లా (YSR District) చిట్వేలి మండలం (Chitveli mandal), గొల్లపల్లి (Gollapalli)లో నిన్న రాత్రి (జూన్ 4) హ‌ల్‌చ‌ల్ చేశాడు. మద్యం మత్తులో ముగ్గురు యువకులపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. కారు హారన్ కొట్టినప్పుడు తొలగని కారణంగా సీమరాజా, మరికొందరితో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు.

బాధితుల వివ‌రాల ప్ర‌కారం.. సీమరాజా మరియు అతని సహచరులు పూర్తిగా మద్యం సేవించి, ఇష్టారీతిన యువకులను చితకబాదారు. దాడి అనంతరం, బాధితులను నేరుగా చిట్వేలి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన సీమరాజా, అక్కడ కూడా వారిపై దాడి చేశాడ‌ని బాధితులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాక, బాధితులపై గంజాయి కేసు పెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. సీమరాజా చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. సీమ‌రాజా లాంటి వ్య‌క్తులు స‌మాజానికి హానిక‌ర‌మ‌ని బాధితులు మండిప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment