విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కి సూపర్ హిట్ సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ మరియు వసూళ్ల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలన్న డిమాండ్తో ఈ పిటిషన్ దాఖలైంది. క్విడ్ ప్రోకో జరుగుతోందని పిటిషనర్ ఆరోపిస్తూ ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పండుగ సందర్భంగా విడుదల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుని సూపర్ హిట్గా నిలిచింది. చిత్ర యూనిట్ సక్సెస్ మీట్లను కూడా జరుపుకుంటోంది. ఈ తరుణంలో పిటిషన్ దాఖలవ్వడం మూవీ మేకర్స్ను షాక్కు గురిచేసింది. ఈ కేసు సినిమా పరిశ్రమలో ఆర్థిక పారదర్శకతపై కీలక చర్చకు దారి తీసింది. మరి హైకోర్టు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.