ఐపీఎల్ పునఃప్రారంభం.. షెడ్యూల్ ప్ర‌క‌టించిన బీసీసీఐ

ఐపీఎల్ పునఃప్రారంభం.. షెడ్యూల్ ప్ర‌క‌టించిన బీసీసీఐ

క్రికెట్ అభిమానుల‌కు బీసీసీఐ తీపిక‌బురు అందించింది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 18వ సీజన్‌ మళ్లీ ప్రారంభం కానుంది. మే 17 నుంచి మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం, పోలీస్‌ శాఖ, ప్రైవేట్‌ భద్రతా సంస్థలు, లీగ్‌ భాగస్వాములతో బీసీసీఐ సంప్రదింపులు జరిపిన అనంతరం మిగిలిన 17 మ్యాచ్‌లను ఆరు నగరాల్లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. బెంగళూరు, జైపూర్‌, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లోని క్రికెట్ స్టేడియాల్లో మాత్ర‌మే నిర్వ‌హిస్తారు.

లీగ్ షెడ్యూల్

మే 17 నుంచి 27 వరకు లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వచ్చే రెండు ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు (డబుల్‌ హెడర్లు) నిర్వహిస్తారు.

ప్లేఆఫ్స్ షెడ్యూల్:
మే 29: తొలి క్వాలిఫయర్
మే 30: ఎలిమినేటర్
జూన్ 1: రెండో క్వాలిఫయర్
జూన్ 3: గ్రాండ్‌ ఫైనల్
ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల వేదికలు త్వరలో ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది.

ఇక మే 10న హైదరాబాద్‌లో జరగాల్సిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ను మే 25న న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. అలాగే, మే 8న ధర్మశాలలో అర్ధాంతరంగా నిలిచిన పంజాబ్‌ కింగ్స్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను మే 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి తిరిగి ఆడిస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment