ఆ మంత్రి కుటుంబం రూ.7 వేల కోట్ల భూకుంభకోణం.. – హరీశ్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆ మంత్రి కుటుంబం రూ.7 వేల కోట్ల భూకుంభకోణం.. - హరీశ్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లో రూ.7 వేల కోట్ల విలువైన భారీ భూకుంభకోణంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ సంద‌ర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్ హరీశ్‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం ప్రభుత్వ భూములైన 373 ఎకరాలను ఆక్రమించి, అవి శిల్పా ఇన్ఫ్రా, ఎక్యూ స్కై్వర్ రియల్టర్స్, శిల్పా రాఘవ ఎల్‌ఎల్‌పీ వంటి సంస్థలలోకి మార్చి విక్రయిస్తున్నారని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

హైకోర్టు ఇప్పటికే ఈ భూముల విక్రయాలు చెల్లవని స్పష్టం చేసింది, సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణకు సిద్ధంగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు, ప్రభుత్వ భూములుగా 2008లో ప్రకటించబడిన ఈ భూములు ల్యాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని ఉల్లంఘించి 2016లో కొద్దీగా విక్రయించబడ్డాయని, దాంతో క్రిమినల్ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

నాద‌ర్‌గుల్‌ భూములపై దాదాపు 600 మంది పేద రైతులు తరతరాలుగా సాగు చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. కానీ బౌన్సర్లు, రౌడీలు, మహిళా రైతులపై భయభీతి సృష్టిస్తూ, భూములను కూల్చి, కంచెలను ధ్వంసం చేస్తూ అక్రమంగా ఆక్రమణ చేస్తున్నారని చెప్పినారు.

మంత్రి కుటుంబానికి సంబంధించిన కంపెనీల ద్వారా భూములను మార్చడం, బోర్డులు మారుస్తూ అక్రమంగా లాభాలు పొందడంపై హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకు వెళ్లి, అక్రమ కాంపౌండ్‌వాల్ కూల్చి, ఆక్రమణదారులను అరెస్ట్ చేసి, రైతులను భూముల్లోకి తిరిగి తీసుకురావాలని హరీశ్‌రావు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment